Tuesday, April 26, 2011

శ్రేయస్సు - ప్రేయస్సు

స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కంచి పరమాచార్యులవారు అంటే వల్లమాలిన భక్తి. 1978లో జనతా ప్రభుత్వ పాలనా కాలంలో ఈమె లక్ష్యాలన్నీ ఘోరంగా విఫలమయ్యాయి.అప్పట్లో ఈమె స్వామివారిని దర్శించి "స్వామీజీ, నేను ఎన్నికల్లో పోటీ చేయదలచాను. గెలిచేట్లు ఆశీర్వదించండి" అని కోరారట. ఆ మాట విని స్వామి వారు సుమారు అరగంట సేపు మౌనందాల్చారట. ఎంతకూ జవాబు రాక పోయేసరికి శ్రీమతి ఇందిరాగాంధీ పునరాలోచించి "స్వామీజీ,నేను జీవితాంతం దేశానికి సేవ చేయదలచాను - ఆశీర్వదించండి"  అనగానే స్వామీజీ చిరుదరహాసంతో అభయ హస్తం చూపారట. - కామకోటి ప్రచురణ

ధర్మం,మోక్షం కూడిన అర్ధ,కామములు ఉన్నత లక్ష్యాలను చూపి శ్రేయోదాయకమయిన పురుషార్ధములుగా నిలుస్తాయి. కానిచో ప్రియమును కలిగించినా శ్రేయస్సును కలిగింపవు.

No comments:

Post a Comment