Thursday, April 14, 2011

శంకరాచార్య - ఏక శ్లోకి

కిం జ్యోతి స్తవ భానుమానహానిమేరాత్రౌ ప్రదిపాదికం
స్యా దేవం రవిదీపదర్శన విధౌకింజ్యోతిరాఖ్యాహిమే,
చక్షు స్తస్య నిమీలనాది సమయే కింధీధియోః దర్శనే
కిం, తత్రహ మతో భవాన్ పరమకం జ్యోతిః తదస్మి ప్రభో


ఇది శంకర భగవత్పూజ్యపాదులు రచించిన ఏక శ్లోకి, ప్రశ్నోత్తరరూపంలో ఆచార్యులవారు ప్రతిజీవి లోనూ ఉన్న సనాతన ఆత్మ పదార్ధాన్ని వివరించారు.

ప్రశ్న : లోకంలో ఇన్ని వస్తువులు చూస్తున్నఅవి గదా, వస్తువు ప్రకాశమయిన జ్యోతి ఏది
సమాధానం : పగటిపూట సూర్యుడు. రాత్రి ప్రదీప చంద్రాదులు.
ప్రశ్న : మంచిది. అయితే ఈ సూర్యుడిని చంద్రుడిని నీవు దేని సహాయం తో చూస్తున్నావు?
సమాధానం : నేత్రములు.
ప్రశ్న : కన్నులు పని చేయనప్పుడు లేదా మూసినప్పుడు దేని సహాయం తో చూస్తున్నావు?
సమాధానం : బుధ్ధి
ప్రశ్న : ఈ బుధ్ధిని చూచునది ఏది?
సమాధానం : నేను. అనగా నా ఆత్మయే ద్రష్ఠ.
ప్రశ్న : అయితే జ్యోతుల కెల్లను పరంజ్యోతివి నీవే కదా?
సమాధానం : ప్రభూ! అవును.మీరూ, నేను ఆ పరంజ్యోతి స్వరూపులమే.

తత్వమసి అని బోధిస్తూ చివరికి సాధకుని ద్వారా 'అహం బ్రహ్మాస్మి'అని చెప్పించారు, శంకరులు.

శ్లో||శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం
నమామి భగవత్పాద శంకరం లోకశంకరం ||

No comments:

Post a Comment