Sunday, May 1, 2011

కాలకాలాయ రుద్రాయ నీలగ్రీవాయ మంగళం

 ఒక ప్రశాంతమయిన చెరువులో ఉన్నట్టుండి అలజడి మొదలయ్యింది.చేపలు అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాయి. జాలరులు వస్తున్నారు, మనము తప్పించికునే మార్గం ఏమన్నా ఉన్నదా అని చర్చ జరిగింది. వయసులో పెద్దవయిన కొన్ని చేపలు అన్నాయి "వాళ్ళ కాళ్ళ దగ్గరికి వెళ్ళి వేడుకుందాము" అని. వయసులో చిన్నవయినవి అన్నాయి శత్రువు పాదాల దగ్గరికి పోవాలా అని.వాటి ఇష్ఠానిసారం చేశాయి, బుద్ది కర్మని అనుసరిస్తుంది గదా. జాలరులు లోతు ఉన్న చోట చేపలు బాగా దొరుకుతాయి అన్న లెక్కతో కొంత ముందుకి వెళ్ళారు.వేడుకుందాము అని చెరువు గట్టికు దగ్గరగా వచ్చిన చేపలు బతికాయి.

కాలం ప్రతి క్షణం కబళించడానికి దగ్గరకు వస్తుంది. మనం గనక కాలకాలుడిని ఆశ్రయిస్తే భక్తుడి కోసం కాలకూఠవిషమును సైతం అవలీలగా మింగేస్తాడు నీలకంఠుడు.

చంద్రశేఖర మాశ్రయే మమ కిం కరిష్యతి వై యమః

No comments:

Post a Comment