అయోద్యలో దశరధుని చేత విశ్వామిత్రుని యాగ సంరక్షణార్ధం పంపబడిన శ్రీ రాముడు ప్రప్రధమముగా తాటకిని చంపాడు. యాగ సంరక్షణార్ధం విశ్వామిత్రుడు రాముడిని యాగశాల ముందు కాపలాగా నియమిస్తాడు. మిగిలిన శిష్యులతో యాగం చేస్తున్న విశ్వామిత్రుడు మాత్రం యాగం చేస్తున్నప్పుడు ప్రతి స్వాహాకారానికి ముందు ద్వారము వంక చూస్తూ తరువాత హవిస్సు సమర్పిస్తూ ఉంటాడు. శిష్యులకు మాత్రం విశ్వామిత్రుడు చేశే ఈ చర్య అర్ధం ఏమిటో బోధ పడదు. విశ్వామిత్రుడు మాత్రం యజ్ఞ భొక్త అయిన విష్ణువే ఈ యాగ సంరక్షణ చేస్తున్నాడు అని ఆయనను దర్శిస్తూ యాగమును పరిపూర్ణముగా చేశాడు.
జానకీ కాంత స్మరణం - జయజయ రామ రామ
జానకీ కాంత స్మరణం - జయజయ రామ రామ
No comments:
Post a Comment