Friday, April 15, 2011

ఆహల్య - శాప విమోచనమా - బ్రహ్మ సాక్షాత్కారమా?

ఆహల్య - శాప విమోచనమా - బ్రహ్మ సాక్షాత్కారమా?

1. ఆహల్యకు ఇంద్రునికి మద్య జరిగినది భౌతికమయిన విషయము అని నమ్మితే, ఆమే పతిని అనుగమించే స్త్రీ అవదు కదా?
2. గౌతముడు శిలగా అవ్వమని శాపము ఇచ్చాడా, అసలు ఏమని ఉంటాడు?
3. ఆమె మరి ఏమి చేసిందని మహా పతివ్రతలగా తలిచారు.
4. గౌతముడు వంటి మహాముని తో ఉంటూ ఆమెకు బ్రహ్మీ ముహూర్తములో ఆ భావన వచ్చే ప్రశ్న లేదు గదా.

ఇది భౌతికమయిన విషయము కాకుండా ఎదో నిగూడమయిన రహస్యము ఇందులో ఉండి ఉండాలి.  దోషము వచ్చినది ఇంద్రునికి సంబంధించినది. అహల్య ఇంద్రునికి సంభందించిన ఉపాసన (వైదిక మయినదే) చేస్తూ ఉండి ఉండాలి. బ్రహ్మీ ముహూర్తములో ఆయన ప్రత్యక్షము అయ్యాడు. కానీ తాత్కాలికమయిన ఇంద్ర ఉపాసన, జితేంద్రియుని చేస్తుంది. అన్నిటి కన్నా పరమోత్క్రష్ఠమయిన 'ఆత్మ విద్యను' ఇంద్ర ఉపాసన కన్నా మిన్నగా గౌతముడు  చెప్పి ఉండాలి. దాని కోసం ఆ మహా సాధ్వి సాధన చేసి చివరికి రాయి వలే అయి, చివరికి పరబ్రహ్మమునకు సాకారమయిన శ్రీ రామచంద్ర ప్రత్యక్షమయినట్టుగా సంకేతముల ద్వారా అందించారని భావన.

(ఇది ఒక పురాణ విశ్లేషకుని అభిప్రాయం)

No comments:

Post a Comment