ఈశావాశ్య ఉపనిషత్తు ముఖ్య ఉద్దేశ్యం అంతా "పూర్ణమదః పూర్ణమిదం..." మరియు "ఈశావాశ్య మిదం సర్వం.." అను రెండు శ్లోకాల మీద నడుస్తుంది. అదః అనగా అక్కడ, ఇదం అనగా ఇక్కడ.
నిరాకార నిర్గుణ పరబ్రహ్మం ఫూర్ణము, అలాగే అభిన్న వివర్త నిమిత్త ఉపాదన కారణమయిన బ్రహ్మపదార్ధము దారా వచ్చిన ఈ సృష్ఠి కూడా పూర్ణమే. ఈ పద్దతి లో బ్రహ్మము నుండి పూర్ణమియిన సృష్ఠి కలిపినా, తీసివేసినా.. పరబ్రహ్మము పూర్ణమే. ఇటువంటి సృష్ఠి(జగత్తు)అంతా ఈశ్వరుని/పరబ్రహ్మ చేత ఆవరింప బడియున్నది. అందువలన త్యాగమును అలవరచుకొని అంతట ఉన్న ఈశ్వరుడే అని ప్రవర్తించు/అనుభవించు.ఒక జ్ఞానికి ఉండవలసిన లక్షణములు తెలిపే శ్లోకం.
ఈ భావన తో కర్మయోగమును అనుసరించి ననూ, ఆ కర్మ ఫలములు అంటవు అని రెండవ శ్లోకం చెప్తూంది. ఈ ఆత్మభావనను విస్మరించు వారు ఆత్మకు అంతముందని భావిస్తూ, చీకటితో వ్యాపించిన లోకములు పోందుతారు అని మూడవ శ్లోకం వివరిస్తున్నది. నాలుగవ, అయిదవ శ్లోకములు ఆత్మ యెక్క లక్షణములు చెప్తున్నాయి.
ఆరు,ఏడవ శ్లోకములు ఆత్మానుభూతిని పొంది సర్వదా తననే చూచుకొను లక్షణములు,ఎనిమిదవ శ్లోకం మరలా ఆత్మ యొక్క లక్షణములు విశదపరచుచున్నది.
తరువాత నాలుగు శ్లోకములూ ఆవిద్యను, విద్యను వేరువేరుగా ఉపాసించు వారి ఊత్తర గతులు అలాగా రెంటినీ ఉపాసించు వారి జన్మరాహిత్యమునూ చెప్తున్నాయి. అలాగే తరువాతి నాలుగు శ్లోకములు సంభూతినీ,అసంభూతినీ వేరువేరుగా ఉపాసించు వారి ఊత్తర గతులు అలాగా రెంటినీ ఉపాసించు వారు ఎలా తీరమును దాటెదరో చెప్తున్నాయి.
చివరి మూడు శ్లోకములూ,అంత కాలమునందు ఆత్మను ఆపరోక్షానుభూతి ద్వారా తెలుసుకొనక ముక్తికోసం చేయు ప్రార్ధనను చెప్తున్నయి.
పోరపాట్లు దొర్లినచో అది నా అజ్ఞానమే.
No comments:
Post a Comment