Monday, April 25, 2011

మానస భజరే గురచరణం

ఎందుకని మనసు నందు గురు చరణములను స్మరింపవలెను?

దానిని నిగ్రహించి పరమాత్మ యందు నిలుపవలెను గదా?

దాని వలన మనకు కలిగే లాభమేమిటి?

కలియుగమునందు 18 సెకనుల పాటు మనసును నిగ్రహించి పరమాత్మ యందు నిలిపిన వాడు ముక్తికి అర్హడు.(చంద్రశేఖర పరమాచార్యులు).

"చంచలం హి మనః కృష్ణ" (కృష్ణ ! మనస్సు చంచలమైనది, గాలిని చేతితో బంధించినట్లు, ఎలా నిగ్రహింపవలెను?)

"అసంశయం మహాబాహో మనో దుర్నిగ్రహం చలమ్" (నీవు చెప్పిన మాటలలో సంశయమే లేదు)
అభ్యాసేన తు కౌన్తేయ వైరాగ్యేణ చ గృహ్యతే (కానీ అభ్యాస వైరాగ్యములతో సాధింపవచ్చును)

కృష్ణం వందే జగద్గురుం

No comments:

Post a Comment