Tuesday, July 17, 2012

మహా ప్రస్థానం

మొక్ష-ఇచ్చ మానవుడి కీలక లక్ష్యము.

దానిని ఎలా సాధించాలి?

దైవ నామ స్మరణ ఒక్కటే సులభ మార్గం.

మరి ఎంత కాలం చేయమంటారు ఈ దైవ నామ స్మరణ, కష్టం కదా?

జీవించినంత వరకు.

అదేదో పోయేటప్పుడు చేస్తే సరిపోతుంది గదా. ఇప్పటి నుండి ఎందుకు?

పోయేటప్పుడు చేయాలంటే ఇప్పటినుండి అలవాటు చేసుకోవాలి.

अन्तकाले च मामेव स्मरन्मुक्त्वा कलेवरम् ।
यः प्रयाति स मद्भावं याति नास्त्यत्र संशयः ॥

అంత్య కాలములో ఎవరు నన్ను స్మరిస్తూ శరీరాన్ని వదిలి పెడతారో, వారు నన్నే చేరతారు అనడానికి సంశయము లేదు.(భగవద్గీత)

No comments:

Post a Comment