Saturday, August 6, 2011

నాయమాత్మా బలహీనేన లభ్యతే

అంటే బలం సంపాదించాలి.దేహ దారుఢ్యం ఉండాలి అని అభిప్రాయమా?

కానే కాదు.ధీరుడు,శూరుడు అన్న శబ్దాలను సూచిస్తూ శంకరులు ప్రశ్నోత్తర రత్నావళి లో శమ దమాలు కల వాడు, ఇంద్రియ నిగ్రహం కలవాడు అని చెప్తారు. శమము అనగా మనోనిగ్రహము, దమము అనగా ఇంద్రియనిగ్రహము అని. సాధన చతుష్ఠయం లో కూడా ఇవి కలిగిన సాధకులే మోక్షానికి అధికారి అని పేర్కన్నారు శంకరభగవత్పాదులు.

కాబట్టి మనోనిగ్రహము కలవాడే ఆత్మవిద్యకు అర్హుడు.

1 comment: