వేదోఖిలో ధర్మమూలం. సకల భూతములు ఎటువంటి మార్గమును అనుసరిస్తే శ్రేయస్సు కలుగుతుందో ఆ విధిని నిర్దేశించేది ధర్మం.వాటికి మూలమయినవి వేదములు.ఈ వైదిక మార్గమును అనుసరింపక వారి బుద్దికి తోచిన మార్గము అవలంభిస్తూ అదే ధర్మమని చెప్పే గురువులు కలియుగములో చాలా మంది ఉన్నారు.వారి గురించే చెప్తూ శంకరులు 'దృశ్యంతే హి పురుషాః రాగాది గౌరవాత్ శాస్త్రమతిక్రమవంతః'. వారి వారి రాగ ద్వేషాలను అనిసరించి శాస్త్రాన్ని వారికి అనువుగా చెప్పుకుంటూ గతి తప్పిపోవుచున్నారు. శంకరులు వారి విషయములో బహుజాగ్రత్తగా వ్యవహరింపమని బోధించారు. సరయిన విధిని నిర్దేశించి, మానవునికి శ్రేయస్సుని కలిగించే ధర్మమును, వేదములకు నిశ్చితమయిన అర్దమును తెలువుతూ ఉండే శ్తోత్రీయబ్రహ్మనిష్ఠలు మాత్రమే సరయిన గురువులు.
No comments:
Post a Comment